Tuesday, April 12, 2011

సినీ సాహిత్యం



మన 'సు' కవి ఆత్రేయ

ఆయనెప్పుడూ "పాటకచేరీ" చెయ్యలేదు. వ్రాసి శ్రోతల్నీ, వ్రాయక నిర్మాతల్నీ "యేడిపించాడంతే"! దటీజ్ మా గురుతుల్యుడు "ఆత్రేయ".

నిజంగా కోడూరి కౌసల్యాదేవి వ్రాసిన ఆ నవల్లో "కళ్యాణ్" కి అంత సీను లేకపోయినా, "లత" అత్మాభిమానంతో అతన్ని వేధించినా, వాళ్లని నిజంగా జీవింపచేసినవాడు ఆత్రేయ.

ఈ పాటని యెంతబాగా వ్రాశాడో చూడండి.

"యెవరో రావాలి! నీ హృదయం కదిలించాలి. నీ తీగలు సవరించాలి. నీలో రాగం పలికించాలి." (కళ్యాణ్ స్థితిని యెంతబాగా చెప్పాడో చూడండి!)

"రాచ నగరున వెలసినావు, రస పిపాసకు నోచినావు, శక్తి మరచీ, రక్తి విడచీ, మత్తు యేదో మరగినావు! మరచిపోదగునా?"

"మూలదాగి, ధూళిమూగి, మూగవోయిన మథురవీణా, మరచిపోయిన మమతలాగ, మమతలుడిగిన మనిషిలాగా,  మాసిపోతగునా?"

"యెన్నిపదములు పలికినావో! యెన్ని కృతులని నేర్చినావో! కొనగోటమీటినచాలు. నీలో కోటి స్వరములు పలుకునే!"

యెవరో..............రావాలి!

పాట అయిపోయిన వెంటనే యే యెన్నార్ ఎక్స్ ప్రెషన్...."యెవరో రావాలి! ప్చ్! యెవరో????.....!"

అదీ పాటంటే. సాహిత్యమంటే. సన్నివేశానికీ, పాత్రలకీ తగ్గ సినీ గీతం అంటే!

(నాలోని "కవి" విజృంభించి, చరణాల్లో అనేక 'పాఠ్యాంతరాలని ' ప్రవేశపెట్టదలిచినా, గురువుగారు వ్రాసిన సాహిత్యాన్ని యథాతథంగా వ్రాయడానికి ప్రయత్నించాను. ఇంకా యేమైనా తప్పులుంటే క్షంతవ్యుణ్ణి.) 

No comments: