Tuesday, April 13, 2010

పద్య సాహిత్యం

ఆణిముత్యాలు

'గండరగండడై యలవు గండను మెండుగ తాండవింప.......' అనే పద్య పాదం "పలనాటి వీర చరిత్ర" అనే పద్య కావ్యం లోనిది. యుధ్ధం లో బాల చంద్రుడి పరాక్రమాన్ని వర్ణించేది.

వ్రాసిన వారు కవి కోకిల దువ్వూరి రామి రెడ్డి గారనుకుంటా.

ఆయన 'పాంథశాల' కి వచ్చినంత ఫేం మిగిలిన కావ్యాలకి వచ్చినట్టులేదు.

పద్యం యెవరైనా పూర్తిగా ప్రచురిస్తే, సంతోషిస్తాను.


ఇంకో పద్య పాదం......

"కళవళమొంది తెలిపితివొ, కాక పరాకున తప్ప వింటివో, కలనైనన్

రఘూద్వహుడు కానలలో నను త్రోయబంచునే?"

ఈ పద్యాన్ని పూరిస్తారా యెవరైనా?

Sunday, April 4, 2010

అవధానాలు

సంగీతావధానం

శ్రీ సాయి కృష్ణ యాచేంద్ర సంగీతావధాని. 

ఈ అవధానం లో అష్టావధానం లాగానే పృచ్చకులు దత్తపది, సమస్య లాంటి ప్రశ్నలు వేస్తే, వాటిని చందోబధ్ధం గా పూరిస్తూ, ఓ రాగం లో బాణీ కట్టి, ఆలపించాలి.

ఇందులో యాచేంద్రని మించినవారు లేరు. ఇంకెవరైనా అభ్యసిస్తున్నారో లేదో తెలియదు.

శ్రీ యాచేంద్రకి ఓ సారి దత్తపది లో 'కోకో' 'వాలిబాల్' 'కబాడి' 'క్రికెట్టు' అనే ఆటల పేర్లతో దత్తపది ఇచ్చి, భక్తి భావం తో పూరించమన్నారు.

ఆయన పాడిన తీరు గుర్తుంది గానీ సాహిత్యం పూర్తిగా గుర్తు లేదు. సమస్యని ఆయన సాధించిన విధం మాత్రం హృదయానికీ మనసుకీ హత్తుకొని వుండి పోయింది.

అది.......

"యెందుకో కోదండరాముని......."

"....తల్లి వొడిలో వాలి బాలునివలె........"

"......గీతిక బాడి........."

"చక్రికెట్టుల..............."

ఇలాగ!

ఇది వొక ప్రశంసనీయ ప్రక్రియే. ఇంకెవరైనా తర్ఫీదు చెందితే బాగుండును.