ఆణిముత్యాలు
'గండరగండడై యలవు గండను మెండుగ తాండవింప.......' అనే పద్య పాదం "పలనాటి వీర చరిత్ర" అనే పద్య కావ్యం లోనిది. యుధ్ధం లో బాల చంద్రుడి పరాక్రమాన్ని వర్ణించేది.
వ్రాసిన వారు కవి కోకిల దువ్వూరి రామి రెడ్డి గారనుకుంటా.
ఆయన 'పాంథశాల' కి వచ్చినంత ఫేం మిగిలిన కావ్యాలకి వచ్చినట్టులేదు.
పద్యం యెవరైనా పూర్తిగా ప్రచురిస్తే, సంతోషిస్తాను.
ఇంకో పద్య పాదం......
"కళవళమొంది తెలిపితివొ, కాక పరాకున తప్ప వింటివో, కలనైనన్
రఘూద్వహుడు కానలలో నను త్రోయబంచునే?"
ఈ పద్యాన్ని పూరిస్తారా యెవరైనా?