ఆణిముత్యాలు
"కళవళమొంది తెలిపితివొ, కాక పరాకున తప్పవింటివో! కలనైనన్ రఘూద్వహుడు కానలలోనను త్రోయబంచునే?"
ఈ పద్య పాదం కంకంటి పాపరాజు వ్రాసిన 'ఉత్తర రామ చరిత్ర' లోది.
పాపరాజు చక్కటి తెలుగులో ఖండకావ్యాలూ, కావ్యాలూ వ్రాశారు.
సన్నివేశం--లక్ష్మణుడు, సీతని గర్భవతిగా వున్నప్పుడు, రాముడు ఆవిడ కోరిక ప్రకారం వనసీమలలో విహారానికి తీసుకెళ్ళమన్నాడు అని చెప్పి, అక్కడికి చేరాక, చావుకబురు చల్లగా చెప్పాడు--అక్కడ వదిలేసి రమ్మన్నాడని.
అప్పుడు ఒక్కసారిగా షాక్ తిన్న సీత, ఆ షాక్ లక్షణాలని లక్ష్మణుడికి ఆపాదిస్తూ, 'నువ్వే కలవరపాటు తో ఇలా చెపుతున్నావో? లేక ఆయన చెప్పిన మాటలు పరాగ్గా వుండి యేమి విన్నావో! కలలోనైనా, రాముడు నన్ను అడవుల్లో త్రోయమని పంపిస్తాడా!' అని ప్రశ్నిస్తుంది సీత.
ఆవిడకెంత నమ్మకమో రాముడి మీద--పిచ్చి తల్లి!
పద్యం పూర్తిగా గుర్తుకి రాలేదు--యెవరూ పూరించలేదు!
సరే.
"రంతుల్ మానుము కుక్కుటాధమ......ఉలూఖల.....తండులముల్...."
యెవరైనా పూరించగలరా?