Tuesday, March 16, 2010

దైవదత్తం

పుంభావ సరస్వతి

సరస్వతిదేవి కళలకి కాణాచి. ఆమెని పురుషుడిగా భావిస్తే, ఆ వ్యక్తిని పుంభావ సరస్వతి అంటారు.

అలాంటివాళ్ళలో మొదటివాడు కాళిదాసు!

రెండోవాడు మన గరికపాటి నరసిం హా రావు! ఇవాళ ఓ చానెల్లో ఆన్ లైన్ అష్టావధానాన్ని అలవోకగా నిర్వహించాడు!

యెంతమందినో అవధానులని చూశానుగానీ, ఇలా అలవోకగా నిర్వహించేవాడు ఈయనే!

ఓం హ్రీం క్లీం ఐం లం యం.....వీటిని బీజాక్షరాలు అంటారు.

ఈ బీజాక్షరాలతోనే మంత్రాలు మొదలవుతాయి--దైవపూజకైనా, క్షుద్రపూజకైనా.

కాళిదాసు తన భార్యా పిల్లలతో కాళికాలయం లో ఆశ్రయం పొందుతూ, తన అపాండిత్యాన్ని అందరూ హేళన చేస్తే, భార్య కూడా ప్రశ్నిస్తే, కాళిక విగ్రహం ముందు ఆత్మహత్య చేసుకోబోతుంటే, కాళికాదేవి అతని నాలుక పై బీజాక్షరాలు వ్రాసిందట--అవేమిటో తెలియదుగానీ, అతను మహా కవి అయిపోయాడు.

ఓ సారి భోజరాజు ఆస్థానం లో పెద్ద సమస్య వచ్చి, నవరత్నాలలో యెవరు గొప్ప కవి, పండితుడు అనే పోటీ వచ్చినప్పుడు, స్వయం గా కాళికాదేవిని అడగడానికి వెళ్ళారందరూ.

అప్పుడు కాళికాదేవి 'కవిర్దండిః, కవిర్దండిః, భవభూతిః పండితః!' అందట.

కోపం వచ్చిన కాళిదాసు, 'కోహం రణ్డే?' అనడిగితే......

'త్వమేవాహం! త్వమేవాహం! న సంశయః!' అందట.

దండి కవి, భవభూతి పండితుడు అని చెప్పిన కాళికని, మరి నేనెవరినే రండా? అని కాళిదాసు అడిగితే, నువ్వే నేను, నేనే నువ్వు--అందట! 

అంటే, నేను రండనైతే, నువ్వూ అదే అనేకదా?

యెలావుంది?

Friday, January 8, 2010

సంపాదన


ఖర్చు


"రైదాసు" ఒక చర్మకారుడు.  


గంగానది ముందు ఓ చెట్టు క్రింద కూర్చొని, చెప్పులు కుట్టుకుంటూ జీవనం చేసేవాడు.  


ఉదయాన్నే డ్యూటీ యెక్కి, మధ్యాహ్న భోజన సమయం వరకూ, అక్కడే కూర్చొని, తన పని అయిపోగానే--భగవంతుడిమీద కీర్తనలు పాడుకొంటూ వుండేవాడుట.  


ఒక రోజు ఓ పెద్దాయన అతనిని 'నువ్వు రోజుకి యెంత సంపాదిస్తావు? దాన్ని యెలా ఖర్చు పెడతావు? ఈ పాటలు మానేస్తే, ఇంకా యెక్కువ సంపాదించుకోవచ్చు కదా?' అని అడిగితే--అతను ఇచ్చిన సమాధానం ఇది!  


'అయ్యా--నేను రోజూ నాలుగు రూపాయలు మాత్రమే సంపాదిస్తాను! ఆ నాలుగూ చాలు నాకు!  


అందులో ఒకటి నేను తింటాను--నాకూ, నా భార్యకీ ఆ రూపాయి సరిపోతుంది.  


రెండోది అప్పు ఇస్తాను--అంటే నా పిల్లలకి పెడతాను! నా వృధ్ధాప్యం లో మళ్ళీ వసూలు చేసుకొనే అప్పు అదే కదా?  


మూడోది అప్పు తీరుస్తాను--అంటే నా తల్లిదండ్రులకి పెడతాను--వారి ఋణం తీర్చుకొనే మార్గం అదే కదా?  


ఇక నాలుగోది నూతిలో పారేస్తాను--అంటే దాన ధర్మాలు చేస్తాను--పరలోకం లో పనికి వచ్చే పుణ్యానికి అదే మార్గం కదా?  


ఇంక ఖాళీగా వుడే సమయం లో ఆ పరమాత్ముణ్ణి కీర్తించుకొంటూ వుంటాను! అంతే!' అన్నాడట!  


అతనే తరవాత 'సంత్ రవిదాసు' గా ప్రసిధ్ధి పొందాడట!

Saturday, January 2, 2010

సంపాదన...

ఖర్చు


ఏక్ మైఁ ఖాతా, 
దూసరా ఉథార్ దేతా, 
తీసరా కర్జ్ చుకాతా, 
ఔర్ చౌథా కువేఁ మేఁ ఫేఁ క్ దేతా!  


దీని భావమేమి తిరుమలేశా?

Friday, December 11, 2009

తెలుగు


కారడవి


నేను 'తెలుగు సాహిత్యం' లేబెల్ తో, కారడవి శీర్షిక తో వ్రాసిన వచనం, పద్యాలూ అందరూ చదివే వుంటారు.  


అది శ్రీమదాంధ్ర మహా భాగవతం లోని 'గజేంద్రమోక్షం' ప్రారంభం లో, గజరాజు తిరిగే అడవి వర్ణన అది.  


చూశారా, యెంత చక్కగా వర్ణించాడో--బమ్మెర పోతన! యెన్నిరకాల వృక్షాలు, జంతువులు, పక్షులు--ఇలా 'ఫ్లోరా & ఫౌనా' అంతటినీ వర్ణించాడు!  


తెలుగు భాష, తెలుగు సాహిత్యం అంటే అది!  


జూనియర్ లెక్చరర్ల కోసం పెట్టే పరీక్షలో ఇస్తున్న--ఫలానా కవి యే శతాబ్దం లో జీవించాడు? ఫలానా రచనని యెవరికి అంకితం ఇచ్చాడు? ఫలానా కవికి వున్న బిరుదులేమిటి?--ఇలాంటివి కాదు!  


తెలుగుని ప్రేమిద్దాం--తెలుగు సాహిత్యాన్ని ప్రేమిద్దాం!



Saturday, December 5, 2009

అవలోకనం

గత ఐదారు నెలలుగా నా ‘సాహితీ….’ బ్లాగు మీద తెలుగు సాహిత్యాభిమానులూ, సాహిత్య పిపాసులూ ‘శీతకన్ను‘ వేస్తున్నారా అని సందేహం వస్తోంది.


శ్రీ భైరవభట్లవారు కూడా, వేడుకున్నా కరుణించడం లేదు మరి!

నిజమంటారా?

Saturday, November 14, 2009

శౌర్యం

సగమే.....

ఉ. "గండరగండడై యలవు గండను మెండుగ దాండవింపను
        ద్దండ విరోధికాండమును దర్పమునన్ విదళించిమించుచున్............."

ఓ చారిత్రక పద్యకావ్యం లోనిదీ పద్యం. కవి శ్రీ మరుపూరి కోదండరామి రెడ్డి గారని ఙ్ఞాపకం. మిగిలిన రెండు పాదాలూ యెంత గింజుకున్నా గుర్తు రావడం లేదు. మిత్రులు కరుణించండి మరి!




Sunday, September 20, 2009

ఓ పుష్పం తపన



ఫూల్ కీ ఇచ్చా  


చాహ్ నహీఁ సుర్ బాలాకే గహనోం మే గూంథా జావూఁ 
చాహ్ నహీఁ ప్రేమీ మాలా మే బింధ్ ప్యారీ కో లలచావూఁ 
చాహ్ నహీఁ సమ్రాటోంకే శవ్ పర్ హే హరి! డాలా జావూఁ 
చాహ్ నహీఁ దేవోం కే శిర్ పర్ చఢూఁ, భాగ్యపర్ ఇఠలావూఁ!  


ముఝే తోడ్ లేనా బన్ మాలీ.... 
ఉస్ పథ్ పర్ దేనా తుం ఫేంక్....  


మాతృ భూమిపర్ శీష్ చఢానే 
జిస్ పధ్ జాయేఁ వీర్ అనేక్!  


.........శ్రీ మాఖన్ లాల్ 'చతుర్వేది '