పుంభావ సరస్వతి
సరస్వతిదేవి కళలకి కాణాచి. ఆమెని పురుషుడిగా భావిస్తే, ఆ వ్యక్తిని పుంభావ సరస్వతి అంటారు.
అలాంటివాళ్ళలో మొదటివాడు కాళిదాసు!
రెండోవాడు మన గరికపాటి నరసిం హా రావు! ఇవాళ ఓ చానెల్లో ఆన్ లైన్ అష్టావధానాన్ని అలవోకగా నిర్వహించాడు!
యెంతమందినో అవధానులని చూశానుగానీ, ఇలా అలవోకగా నిర్వహించేవాడు ఈయనే!
ఓం హ్రీం క్లీం ఐం లం యం.....వీటిని బీజాక్షరాలు అంటారు.
ఈ బీజాక్షరాలతోనే మంత్రాలు మొదలవుతాయి--దైవపూజకైనా, క్షుద్రపూజకైనా.
కాళిదాసు తన భార్యా పిల్లలతో కాళికాలయం లో ఆశ్రయం పొందుతూ, తన అపాండిత్యాన్ని అందరూ హేళన చేస్తే, భార్య కూడా ప్రశ్నిస్తే, కాళిక విగ్రహం ముందు ఆత్మహత్య చేసుకోబోతుంటే, కాళికాదేవి అతని నాలుక పై బీజాక్షరాలు వ్రాసిందట--అవేమిటో తెలియదుగానీ, అతను మహా కవి అయిపోయాడు.
ఓ సారి భోజరాజు ఆస్థానం లో పెద్ద సమస్య వచ్చి, నవరత్నాలలో యెవరు గొప్ప కవి, పండితుడు అనే పోటీ వచ్చినప్పుడు, స్వయం గా కాళికాదేవిని అడగడానికి వెళ్ళారందరూ.
అప్పుడు కాళికాదేవి 'కవిర్దండిః, కవిర్దండిః, భవభూతిః పండితః!' అందట.
కోపం వచ్చిన కాళిదాసు, 'కోహం రణ్డే?' అనడిగితే......
'త్వమేవాహం! త్వమేవాహం! న సంశయః!' అందట.
దండి కవి, భవభూతి పండితుడు అని చెప్పిన కాళికని, మరి నేనెవరినే రండా? అని కాళిదాసు అడిగితే, నువ్వే నేను, నేనే నువ్వు--అందట!
అంటే, నేను రండనైతే, నువ్వూ అదే అనేకదా?
యెలావుంది?